చిరు కేరళ మసాజ్ వెనుక కథ

February 02, 2015 | 02:42 PM | 40 Views
ప్రింట్ కామెంట్

చిరంజీవి 150వ సినిమాకు ఎవరెవరినో డైరెక్టర్లను లింక్ చేస్తూ ఎన్నెన్నో వార్తలు వచ్చాయి. సినిమా ఇంతవరకూ కన్ఫం కాలేదు గానీ చిరంజీవి 150వ సినిమా కోసం కేరళ ప్రయాణమయ్యాడని తెలుస్తోంది. దీంతో ఈ సంవత్సరం చిరంజీవి సినిమా తప్పకుండా ప్రారంభం కాబోతోందనేది తెలిసిపోతోంది. డాన్సులు, ఫైట్ల కోసం షూటింగ్ మొదలవక ముందే చిరంజీవి తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆయన కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. కాస్త గ్లామర్ గా కనిపించడానికి ఇక్కడ ఆయన పలు రకాల ఆయుర్వేద మసాజులు చేయించుకుంటున్నట్లు సమాచారం. చిరంజీవి సినిమా కోసం మెగా అభిమానులంతా మూడేళ్ళుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తాడనీ, డైరెక్టర్‌ ఎవరనేది ఇంతవరకు నిర్ణయించలేదని తెలుస్తోంది. 150వ చిత్రం 2014లోనే పూర్తవుతుందని అనుకున్నారు. కానీ అనేక కారణాలతో సినిమా ఇంకా మొదలు కాలేదు. అయితే తాజాగా 150వ సినిమా 2015లో తప్పకుండా వస్తుందనేది చిరంజీవి కేరళ ప్రయాణం ద్వారా తెలుస్తోంది. తాజాగా వినవస్తున్న మరో విషయం 150వ చిత్ర కథకు సంబంధించిన పూర్తి బాధ్యతను చిరంజీవి పరుచూరి సోదరులకు అప్పగించినట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ