అభిమానమే అండగా నిలుస్తోంది

December 08, 2014 | 11:53 AM | 39 Views
ప్రింట్ కామెంట్

చూసే వాళ్లంతా పిచ్చి, వెర్రి అనుకున్నప్పటికీ సినీ నటులపై ఉన్న అభిమానమే వారి అభిమానులకు శ్రీరామ రక్షగా నిలుస్తోంది. మొన్నా మధ్య ఖమ్మంలో తీవ్ర అస్వస్థతో భాదపడుతున్న తన వీరాభిమాని అయిన శ్రీజను పవన్ కళ్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆ అమ్మాయి ఆశ్చర్యకరరీతిలో కొలుకుంది. అంతేకాదు పవన్ పై ఉన్న అభిమానమే తనను బతికించేలా చేసిందని చెప్పింది కూడా. ఇప్పుడు ఇలాంటి మరోక సంఘటన హైదరాబాద్ లో జరిగింది. కాకపోతే ఈసారి నటసింహం బాలయ్య వంతు. వివరాల్లోకి వెళ్లితే... నర్సారావ్ పేటకు చెందిన శ్రావణి(12) అనే అమ్మాయి 2011 నుంచి ల్యూకేమియాతో బాధపడుతుంది. అంతేకాదు అదే క్రమంలో కంటి చూపు కూడా కొల్పోయింది. తర్వాత చికిత్స నిమిత్తం ఆ అమ్మాయిని తల్లిదండ్రులు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స సమయంలో ఆమె తాను బాలక్రుష్ణకు వీరాభిమానినని చెప్పింది. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు బాలయ్య బాబుకు చేరవేశారట. అంతే శ్రావణి చికిత్స విషయంలో శ్రద్ధ వహించాలని బాలయ్య వైద్యులకు సూచించాడట. కొద్ది కాలంగా చికిత్స పొందిన శ్రావణికి వ్యాధి నుంచి పూర్తిగా కొలుకొవడమే కాదు... పొయిన కంటి చూపు కూడా వచ్చింది. దీంతో వైద్యలు ఈ విషయాన్ని బాలయ్యకు చేరవేశారట. అంతే సంతోషంతో ఆయన శ్రావణి ముందు వాలిపోయారు. బాలయ్యను కలవాలన్న ఆ అమ్మాయి కొరికే తనను తొందరగా కొలుకునేలా చేసిందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. సంకల్పమో... అద్భుతమో... మొత్తానికి శ్రావణి కథ సుఖాంతం అయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ