స్వీటీ... వెరీ గుడ్ గర్ల్

December 09, 2014 | 05:04 PM | 84 Views
ప్రింట్ కామెంట్

ఒకే సినిమాలో ఇద్దరు ప్రధాన హీరోలు, ఇద్దరు ప్రధాన హీరోయిన్లు ఉన్నప్పుడు తమ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గినట్టుగా అనిపించినా గొడవ మొదలైపోతుంది. ఇలాంటి ఈగో ప్రాబ్లమ్స్ రావడం చాలా సార్లు వింటుంటాం. అలాంటిది ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ ఎంతో గొప్ప సినిమాలు చేసిన అనుష్క ఇలాంటి గొడవలేం చేయదని సినిమా దర్శకులు, నిర్మాతలు తెగ కితాబులిచ్చేస్తున్నారు. రజనీకాంత్ లింగా సినిమాలో అనుష్క కంటే సోనాక్షికే ప్రాధాన్యత ఎక్కువట. అలాగే అజిత్ హీరోగా రూపొందుతున్న ఎన్నై అరిందాల్ సినిమాలో కూడా త్రిష పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉందంటున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ అనుష్కది రెండవ స్థానమేనట. అయినా ఏ మాత్రం గొడవ చేయలేదంటున్నారు. నయనతార, త్రిషలకంటే అనుష్క ఎంత మంచి పిల్ల... అని దర్శకనిర్మాతలు తెగ మెచ్చేసుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ