ఆ భూతం సూపర్ స్టార్ ని వదలలేదు

December 13, 2014 | 04:20 PM | 110 Views
ప్రింట్ కామెంట్

ఎంత కట్టడి చేసినా పైరసీ భూతం సినీ ఇండస్ట్రీని వదలనంటోంది. ఎంతలా అంటే ఆఖరికి తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ క కూడా ఈ దెబ్బ రుచిచూడాల్సివచ్చింది. లింగ చిత్రం విడుదలై 24 గంటలు గడవకముందే పెద్ద పైరసీ మాఫియా ముఠాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదులు, వందలు కాదు వేలసంఖ్యలోనే ఈ చిత్ర సీడీలను స్వాధీనపరుచుకున్నారు. బెంగుళూర్ నుంచి వచ్చిన ప్రింట్ ఆధారంగా తయారుచేసిన సుమారు 3వేల లింగ పైరసీ సీడీలను పోలీసులు రికవరీ చేసుకున్నారు. వినుకొండ పట్టణం విష్ణుకుండి నగర్ కు చెందిన వెంకటరామాంజనేయులు ఈ ముఠాకి ప్రధాన సూత్రధారిగా పోలీసులు పేర్కొన్నారు. 22 మానిటర్లను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలకు చెందిన సుమారు 30,000 పైరసీ సీడీలతోపాటు కొన్ని నీలిచిత్రాల సీడీలను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో గీతాంజలి చిత్రానికి చెందిన 2,000 సీడీలు ఉన్నాయి. చిత్రం విడుదలై కొన్ని గంటలు గడవకముందే ఓ మాములు ఇంట్లో నడిచిన ఈ హైటెక్ పైరసీ తతంగాన్ని చూసి పోలీసులు సైతం విస్తుపోవాల్సి వచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ