మిలియన్ మార్క్ చేరుకున్న శ్రద్ధా

December 13, 2014 | 02:15 PM | 39 Views
ప్రింట్ కామెంట్

బాలీవుడ్ యువ కథానాయిక శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే పెంచేసుకుంది. ఇప్పుడామె ట్విట్టర్ అకౌంట్లో ఫాలోవర్స్ 10 లక్షలకు చేరుకున్నారు. దీనిపై ఈ ఆషికి2 భామ మరింత ఎగ్జైట్ అవుతోంది. శ్రద్ధా స్పందిస్తూ, వన్ మిలియన్ మార్క్ తో మేల్కొన్నాను! నాపై చాలా ప్రేమ చూపించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బోలెడంత ప్రేమను పొందగలిగాను! అని ట్వీట్ చేసింది. కెరీర్ పరంగా కూడా ఈ ఏడాది శ్రద్ధాకు బాగానే కలిసొచ్చింది. ఏక్ విలన్, హైదర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్మడు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందుకుంది. ప్రస్తుతం శ్రద్ధా ఏబీసీబీ 2 చిత్రం షూటింగుతో బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రేమలో ఉన్నానంటూ ఇటీవలె ట్విట్టర్ లో పెర్కొని కొత్త సస్పెన్స్ కి తెరలేపింది. అఫ్ కోర్స్ అది ఆదిత్యరాయ్ కపూర్ అనే విషయం అందరికీ తెలుసనుకొండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ