ఇండియన్ ప్రీమియర్ లీగ్ను వచ్చే ఏడాది మరో దేశంలో జరపాలని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గవర్నింగ్ నిర్ణయం తీసుకోబోతున్న దశలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్కుంబ్లే స్పందించాడు. భారత్లో వసతుల కొరత కారణంతో తదుపరి ఐపీఎల్ను విదేశాలకు తరలించాలని నిర్వాహకులు చేస్తోన్న ప్రయత్నాలను అనిల్కుంబ్లే వ్యతిరేకించాడు. తిరువనంతపురంలోని 'త్రివేండ్రం స్పోర్ట్స్హబ్'లో ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ని ఒక గ్లోబల్ బ్రాండ్ గా అభివర్ణించాడు. ఐపీఎల్ ను భారత్ లోనే నిర్వహించడం ద్వారా దేశానికి ఎంతో ఆదాయం వస్తుందన్నాడు. ఐపీఎల్ ను విదేశాలకు తరలించవద్దన్నాడు. తదుపరి ఐపీఎల్ భారత్లోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.