టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్ సందర్భంగా ఈ డాషింగ్ ఓపెనర్ ఓ వెబ్సైట్కు విశ్లేషకుడిగా వ్యవహరించనున్నారు. గతంలో పలు టీవీచానెల్స్లో క్రికెట్ కార్యక్రమాల్లో విశ్లేషకుడిగా పనిచేసిన సెహ్వాగ్ ఓ వెబ్సైట్తో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. టీ20 సిరీస్ సందర్భంగా సెహ్వాగ్ తో ఒప్పందం కుదుర్చుకోవటం ఆనందంగా ఉందని ‘క్రిక్బజ్’ ట్విట్టర్లో పేర్కొంది. టోర్నీ సందర్భంగా సెహ్వాగ్ వెబ్సైట్ లో సమీక్ష, విశ్లేషణతోపాటు వీక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారు.