టీ20 వరల్డ్ కప్ కోసం సెహ్వాగ్ కొత్త అవతారం

March 01, 2016 | 04:25 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sehwag-as-analyst-for-crickbuzz-t20-WC-niharonline

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్ సందర్భంగా ఈ డాషింగ్ ఓపెనర్ ఓ  వెబ్‌సైట్‌కు విశ్లేషకుడిగా వ్యవహరించనున్నారు. గతంలో పలు టీవీచానెల్స్‌లో క్రికెట్ కార్యక్రమాల్లో విశ్లేషకుడిగా పనిచేసిన సెహ్వాగ్ ఓ వెబ్‌సైట్‌తో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. టీ20 సిరీస్ సందర్భంగా సెహ్వాగ్ తో ఒప్పందం కుదుర్చుకోవటం ఆనందంగా ఉందని ‘క్రిక్‌బజ్’ ట్విట్టర్లో పేర్కొంది. టోర్నీ సందర్భంగా సెహ్వాగ్ వెబ్‌సైట్ లో సమీక్ష, విశ్లేషణతోపాటు వీక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ