ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. ధావన్ 94 బంతుల్లో 104 పరుగులతో సెంచరీ సాధించాడు. 349 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దీటుగా ఆడుతోంది. ధోనీసేన 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 277 పరుగులు చేసింది. మరోవైపు కోహ్లీ 71 బంతుల్లో 91 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (41) అవుటయ్యాడు. రిచర్డ్సన్ బౌలింగ్‑లో రోహిత్.. కీపర్ వేడ్‑కు దొరికిపోయాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు చేశారు. ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ (107) సెంచరీ చేయగా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (93) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్ స్మిత్ (29 బంతుల్లో 51) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ మార్ష్ 33 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లు ఇషాంత్ 4, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీశారు.