మాంచెస్టర్ టెస్ట్ ఫిక్సయ్యిందా?

February 08, 2016 | 02:07 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Dhoni Fixed Manchester Test Niharonline

యావత్తు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ను ఈ వార్త కలవరానికి గురి చేసేదే. అన్ని ఫార్మట్ లో భారత్ ను ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీపై తొలిసారిగా ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించాయి. 2014లో ఇంగ్లండ్ లో పర్యటించిన సందర్భంగా ఆ దేశ జట్టుతో మాంచెస్టర్ లో జరిగిన టెస్టు ఫిక్స్ అయ్యిందని నాటి టీమిండియా జట్టు మేనేజర్, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి సునీల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ దినపత్రిక ‘సన్ స్టార్’ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా అనిల్ దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.

ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన ఆ మ్యాచ్ కి ధోనీ కెప్టెన్ గా వ్యవహరించాడు. ‘‘వర్షం కారణంగా పిచ్ పరిస్థితి దృష్ట్యా టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకోవాలని జట్టు సమావేశంలో నిర్ణయించాం. కానీ ధోనీ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో నేను ఆశ్చర్యానికి గురయ్యా. ధోనీ నిర్ణయాన్ని చూసి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ కూడా షాకయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లా. నాటి బోర్డు చీఫ్ ఎన్.శ్రీనివాసన్ కు లేఖ రాశా. అయితే దీనిపై ఇప్పటికీ బోర్డు స్పందించలేదు’’ అని దేవ్ పేర్కొన్నాడు. దేవ్ వ్యాఖ్యలున్న ఈ వీడియోను సదరు హిందీ డైలీ నిన్న ఢిల్లీలోని భారత ప్రెస్ క్లబ్ లో ప్రదర్శించింది.

అయితే సునీల్ దేవ్ దీనిని తీవ్రంగా ఖండించారు. "ఇదంతా అవాస్తవం. నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా" అని దేవ్ వ్యాఖ్యానించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ