మెరుపులు మెరిపిస్తాడని, ప్రత్యర్థులకు చుక్కలు చూపించి అభిమానులకు జోష్ తెప్పిస్తాడని అనుకున్న క్రిస్ గేల్ ఆట మరీ దారుణంగా ఉంది. ఈ ఐపీఎల్లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గేల్ నిరాశపరిచాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ సింగిల్ డిజిట్ కే అవుటయ్యాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్పై ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. క్రిస్ గేల్ ఆటతీరుపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని చెప్పాడు. తదుపరి మ్యాచుల్లో క్రిస్గేల్ రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గేల్ పుంజుకొని సెంచరీ సాధిస్తాడని చెప్పాడు. చివరి ఐదు టీ20 మ్యాచుల్లో కనీసం రెండంకెల స్కోరయినా చేయకుండా వెనుదిరిగటం విశేషం.