రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా లలిత్ మోదీ తిరిగి నియమితులయ్యారు. ఐపిఎల్ మాజీ చీఫ్ అయిన మోదీని 2013 లో ఆర్ధిక అవకతవకలకు పాల్పడినందుకు బీసీసీఐ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయన ప్రత్యర్ధి వర్గం మోదీపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవడంతో తిరిగి మోదీ ఆర్సిఏ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. కాగా గత రెండు సంవత్సరాలుగా రాజస్థాన్ క్రికెట్ సంఘంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొమ్మిది నెలల క్రితం బీజేపీ నాయకుడు ఆర్సిఏ ఉపాధ్యక్షుడు అమీన్ పఠాన్ ,మోదీపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. పఠాన్కు 15 జిల్లాల మద్దతు ఉంది. అయితే అనూహ్యంగా ఈవర్గం మోదీకి మద్దతు పలికింది. రాజస్థాన్ క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా రాజీకి వచ్చినట్లు ఆ తర్వాత తెలిపారు