పాక్ చాలా ‘ఓవర్’ చేస్తోంది!

March 09, 2016 | 12:04 PM | 1 Views
ప్రింట్ కామెంట్
PCB-fears-about-Dharamshala-niharonline

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 19న ధర్మశాలలో దాయాదులు భారత్, పాక్ లు తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కి పూర్తి భద్రత కల్పిస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చినా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ధర్మశాలలో కాకుండా మరో చోట మ్యాచ్ నిర్వహించాలని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ ఐసీసీని కోరాడు. మరోవైపు పాక్ క్రికెట్ జట్టు భారత్ బయలుదేరాల్సిన సమయాన్ని వాయిదా వేస్తూ, తదుపరి నిర్ణయం వెల్లడించే వరకూ ప్రయాణాన్ని నిలపాలని పాక్ సర్కారు ఆదేశించింది.

                                       ధర్మశాల నుంచి మ్యాచ్ ని తరలించాలని ఐసీసీకి లేఖరాసిన పీసీబీ, సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని, మొహాలీ లేదా కోల్ కతాల్లో మ్యాచ్ నిర్వహించాలన్నది తమ అభిప్రాయమని ఖాన్ తెలిపారు. తమ జట్టుకు పూర్తి భద్రత ఉందని నమ్మితే ఇండియాతో ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమేనని అన్నారు. కాగా, క్రికెట్ జట్టు ధర్మశాలకు వెళ్లడం తమకు సమ్మతం కాదని పాక్ సెక్యూరిటీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. భద్రత కల్పిస్తామని హామీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ పాక్ ఇలా వెనక్కితగ్గటంతో అక్కడి నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ