అక్తర్ దృష్టిలో మేటి బౌలర్ ఎవరంటే...

February 04, 2016 | 12:10 PM | 3 Views
ప్రింట్ కామెంట్
shoaib-akhtar-praises-ashwin-kohli-niharonline

అంతర్జాతీయ క్రికెట్ కి దూరం కావటంతో కొద్దిరోజులుగా అజ్నాతంలో ఉండిపోయాడు జపాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. ఈ మధ్య ఓ మీడియా ఇంటర్వ్యూ చేయటంతో తిరిగి వెలుగులోకి వచ్చాడు. అయితే రావటం రావటమే భారత జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడీ రావల్పిండి ఎక్స్ ప్రెస్. ముఖ్యంగా చెన్నై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శక్తి సామర్థ్యాలపై పొగడ్తలు గుప్పించాడు.

ఎప్పటికప్పుడు తన ప్రతిభను పెంపొందించుకునేందుకు శతథా యత్నిస్తున్న అశ్విన్... ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని షోయబ్ కీర్తించాడు. టీమిండియా మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ జట్టును గెలుపు తీరాలకు చేరుస్తున్నాడని తెలిపాడు.

                            ఇక టీమిండియా కొత్త కుర్రాడు జస్ ప్రీత్ బుమ్రా అద్భుతమైన రీతిలో అరంగేట్రం చేశాడని చెప్పాడు. మొహ్మద్ షమీ, వరుణ్ ఆరోన్ లాంటి సీమర్లు దూరమవడం భారత్ కు తీరని నష్టమేనని పేర్కొన్నాడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమమని అక్తర్ తేల్చేశాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ