భారత క్రికెట్ అభ్యున్నతికి మాజీల సేవలు వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలో బోర్డు సలహా కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లకు స్థానం కల్పించింది. వీరి నియామకంపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్లో స్పందించారు. ఇకపై ఈ ముగ్గురు సలహా కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. వారి నేతృత్వంలో భారత క్రికెట్ ముందుకెళ్తుందని ట్వీట్ చేశారు. కాగా, ఈ కమిటీ ఏర్పాటు ఆలోచన బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా, ఠాకూర్ లదే. ఇకపై, క్రికెట్ కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ, ముఖ్యంగా టీమిండియా కోచ్ ను ఎంపిక చేసే విషయంలో ఈ సలహా సంఘం మాటకే విలువ ఇస్తారని అర్థమవుతోంది.