బంగ్లాదేశ్ టెస్ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. బుధవారం ఖాన్ సాహెబ్ ఉస్మాన్ ఆలీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన విరాట్ నేతృత్వంలోని సేన బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఇక ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడుతుండగా, మరో ఓపెనర్ విజయ్ నిదానంగా ఆడుతున్నాడు. ధావన్ కేవలం 33 బంతుల్లో 8 ఫోర్లతో 40 పరుగులు సాధించగా, విజయ్ 21 బంతులాడి కేవలం 3 పరుగులే చేశాడు. మొత్తం 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ 43 పరగులు సాధించింది.