బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ధావన్ విరుచుకుపడ్డాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు టీమిండియా కేవలం 56 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 150, మురళీ విజయ్ 89 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్లు ఆరంభం నుంచి కూడా ధాటిగా ఆడారు. తొలిరోజు ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ సాధించాడు. 101 బంతుల్లో 16 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో ధావన్ కు ఇది మూడో సెంచరీ కాగా, బంగ్లాదేశ్ పై మొదటిది. మరో ఓపెనర్ మురళీ విజయ్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 98 బంతుల్లో 7 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతడికిది 11వ అర్ధ సెంచరీ. బంగ్లాదేశ్ పై మొదటిది.