దెబ్బకు దెబ్బ: ప్రతీకారం తీర్చుకున్న కోల్ కతా

May 01, 2015 | 10:28 AM | 23 Views
ప్రింట్ కామెంట్
russell_uttapa_kkr_csk_niharonline

ఐపీఎల్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సొంత గడ్డపై ఏడు వికెట్ల తేడాతో కోల్ కతా ఓడించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కతా ఒక్క బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేధించింది. ఆండ్రీ రస్సెల్ అద్భుత బ్యాటింగ్ కు తోడు, రాబిన్ ఊతప్ప సమయోచిత బ్యాటింగ్ సాయంతో కోల్ కతా విజయ భేరీ మోగించింది. ఆండ్రీ రస్సెల్ 32 బంతుల్లో 52 పరుగులు చేయగా, ఊతప్ప 58 బంతుల్లో 80 పరుగులు చేసి చివరిదాకా ఉండి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆండ్రీ రస్సెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ ద్వారా గత మ్యాచ్ లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ