నరరూప రాక్షసులు... 21 మంది పీకలు కోశారు

February 16, 2015 | 01:04 PM | 42 Views
ప్రింట్ కామెంట్
another_blooded_video_from_ISIS_niharonline

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వంతో రెచ్చిపోయారు. ఈజిప్ట్ కు చెందిన 21 మంది కాప్టిక్ క్రిస్టియన్స్ ని లిబియాలోని ట్రిపోలీ సమీపంలో గల సముద్రతీరంలో తలలు తెగ్గొసి చంపారు. ఆ రాక్షసులు అంతటితో ఆగక భయానక సన్నివేశాన్ని వీడియో తీసి అంతర్జాలంలో ఆప్ లోడ్ చేశారు. కొన్ని వారాల క్రితం వీరందరిని ఉగ్రవాదులు లిబియా నుంచి కిడ్నాప్ చేశారు. నారింజ రంగు దుస్తులు వేసి, సముద్ర తీరం వెంబడి మోకాళ్లపై కూర్చోబెట్టారు. ముఖాలకు నల్ల ముసుగులు ధరించిన ఉగ్రవాదులు పదునైన కత్తులతో గొంతులు కోస్తుండగా, వారి అరుపులు సముద్రపు అలల హోరులో కలిసిపోయాయి. ఈ ఘోర వీడియోను చూసిన మానవ సంఘాలు ఐఎస్ చర్యను తీవ్రంగా ఖండించారు. వారి ప్రాబల్యం పెరుగుతోంది అనడానికి ఈ వీడియో సంకేతమని, దీన్ని అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క వీరి చర్యను ఖండిస్తూ దేశ ప్రజలు ఆందోళన చేపడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ