ఐఎస్ఐఎస్ మానవ మృగాలు... మరో 45 మంది పెట్రోల్ పోసి చంపాయి

February 18, 2015 | 11:05 AM | 39 Views
ప్రింట్ కామెంట్
ISIS_kills_soliders_in_west_Iraq_niharonline

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దారుణాలకు అంతులేకుండా పోతోంది. మొన్నటికి మొన్న 21 మంది ఈజిప్ట్ వాసులను మోకాళ్లపై కూర్చోబెట్టి తలలు తెగ్గొసిని ఘటన మరిచిపోకముందే. ఇప్పుడు మరో దాష్టీకానికి తెగబడ్డారు. మంగళవారం మరో 45 మందిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారట. పశ్చిమ ఇరాక్ లోని ఆల్ బాగ్దాది పట్టణం సమీపంలో ఈ దారుణానికి పాల్పడ్డారట. వీరిని బంధించి మరీ పెట్రోల్ పోసి కాల్చేశారట. వీరిలో సైనికులు కూడా ఉన్నట్లు ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ తెలిపింది. ఇక వీరిని ఎందుకు బలి తీసుకుందో ఐఎస్ ఐఎస్ వివరణ ఇవ్వలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ