జెట్ స్పీడుతో ముస్లింల జనాభా... 2050 నాటికి భారతే టాప్

April 03, 2015 | 12:17 PM | 44 Views
ప్రింట్ కామెంట్
muslim_population_india_increase_niharonline

ప్రపంచంలో ముస్లిం జనాభానే శరవేగంగా పెరుగుతోందట. 2050 నాటికి ముస్లిం జనాభాలో భారత్ ప్రపంచంలోనే తొలిస్థానానికి చేరుతుందని అమెరికాలోని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ ప్రపంచంలో మతపరంగా జనాభా పెరుగుదలపై చేసిన అధ్యయనం ఈ మేరకు అంచనా వేసింది. ఈ అధ్యయనం ప్రకారం... ప్రపంచంలో హిందువులు, క్రైస్తవుల జనాభా కంటే కూడా ముస్లింల జనాభానే అధిక వేగంతో దూసుకుపోతోంది. 2050 నాటికి భారత్ లో ముస్లిం జనాభా ఇండోనేసియా జనాభాను మించిపోతుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం 34 శాతం పెరుగుదల నిష్పత్తిలో పెరుగుతున్న హిందువుల జనాభా ప్రపంచ జనాభాలో మూడో స్థానానికి ఎగబాకుతుందని ఆ అధ్యయనం లెక్కగట్టింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 14.9 శాతంగా ఉండనున్న హిందువుల్లో ఏ మతంతో సంబంధం పెట్టుకోకుండా ఉండేవారి సంఖ్య 13.2 శాతంగా ఉంటారని సదరు అధ్యయన నివేదిక అంచనా వేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ