20 కేజీల బంగారం ఆ లక్కీ గర్ల్ సొంతం

February 13, 2015 | 05:21 PM | 36 Views
ప్రింట్ కామెంట్
Keralite_won_five_kg_gold_in_lucky_dip_niharonline

భారత సంతతికి చెందిన ఓ యువతికి దుబాయ్ లో ఓ లక్కీ డ్రాలో సుమారు 20 కేజీల బంగారం గెలుచుకుంది. ఆ బంగారం విలువ సుమారు రూ.5 కోట్లు. కేరళకు చెందిన ఆన్ అనే యువతి కెన్యాలో పెరిగింది. దుబాయ్ లో ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్న ఆ యువతికి పుట్టినరోజు సందర్భంగా ఓ ఫ్రెండ్ నుంచి బంగారు కాలిపట్టీల జతను బహుమతిగా అందుకుంది. వాటితోపాటు వచ్చిన కూపన్లు ఇప్పుడు ఆమెకు పసిడి పంటను పండించింది. డ్రాలో షాపు వారు ఫోన్ చేసి ఆమెకు గెలుపొందిన విషయం తెలిపారు. దీంతో ఆమె ఉబ్బితబ్బిబి అయిపోతోంది. అయితే, ఇంత భారీ బహుమతి నెగ్గినప్పటికీ నేల విడిచి సాము చేయబోనని, ఉద్యోగంలో కొనసాగుతానని ఆన్ చెబుతోంది. ఇంకో వారంలో ఆమె చేతికి బంగారాన్ని అందజేస్తామని షాపు యాజమాని దుబాయ్ గోల్డ్ అండ్ జ్యువెల్లరీ గ్రూప్ మేనేజర్ టామీ జోసెఫ్ పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ