ఘోర విమాన ప్రమాదం... 142 మంది దుర్మరణం

March 24, 2015 | 05:44 PM | 86 Views
ప్రింట్ కామెంట్
plane_crush_in_Alps_niharonline

మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జర్మనీకి చెందిన ఎయిర్ బస్ ఏ-320 విమానం ఫ్రాన్సులోని దక్షిణ ఆల్ప్స్ పర్వతాల్లో మంగళవారం కుప్పకూలింది. అందులో సుమారు 142 మంది ప్రయాణికులతో పాటు 6 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ విషయాన్ని జర్మనీ పౌర విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. బార్సిలోనా నుంచి జర్మనీలోని డసెల్ డార్ఫ్ కు ఈ విమానం వెళ్తోంది. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం 3.30 గంటల సమయంలో సంభవించింది. ఇంజిన్ లో లోపం లేదా మంట వల్ల విమానం కూలి ఉండొచ్చని చెబుతున్నారు. లుఫ్తాన్స ఎయిర్ లైన్స్ అనుబంధ సంస్థ జర్మన్ వింగ్స్ విమానయాన సంస్థకు చెందిన జీడబ్ల్యుఐ18జి విమానంలో ఇద్దరు పైలట్లు, నలుగురు స్టివార్డులు ఉన్నట్లు తెలిపారు. అది ప్రస్తుతం రాడార్ పరిధిలో ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. ఈ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ఏ ఒక్కరూ మిగిలే అవకాశం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తెలిపారు. విమాన శిథిలాలు కొంతవరకు కనిపించినట్లు ఫ్రెంచి హోంశాఖ తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ