విషాదగాథ: బిడ్డల మృతదేహాలను చేతులతో తవ్విన తల్లి

April 29, 2015 | 02:48 PM | 20 Views
ప్రింట్ కామెంట్
nepal_mother_removing_debris_hands_niharonline

భూకంపం ధాటికి మృత్యుదిబ్బగా మారిన నేపాల్ లో హృదయాన్ని ద్రవింపజేసే కథలెన్నో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తక్షణ సాయం కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాగా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆకలి, దప్పికలు తీరే దారిలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు కన్నవారు దూరమై కొందరు అనాథలుగా మిగిలితే, బిడ్డలను కోల్పయిన వారు, మృతదేహాలు కళ్లముందే కుళ్లిపోతుంటే, కుమిలి పోవటం తప్ప చేసేదేమీ లేని స్థితిలో ఉన్నారు. నేపాల్ లోని గుర్ఛా లోయలో ఓ తల్లి వ్యథ హృదయవిదారకం. సంతాలియా అనే మహిళ భర్త ఇండియాలో పనిచేస్తుండగా, ఆమె ఓ కుగ్రామంలో తన ముగ్గురు పిల్లలతో నివసిస్తుంది. భూకంపం ధాటికి ఇళ్లు కుప్పకూలగా, ఆమె ముగ్గరు పిల్లలు మట్టిపెళ్లల కిందే కూరుకుపోయారు. ఆ సమయంలో ఇంటి బయట ఉన్న ఆమె ప్రాణాలు మిగిలాయి. ఇక నాలుగేళ్ల చిన్న కొడుకు వేళ్లు బయటకు కనిపిస్తుండటంతో వాటిని మాత్రం వెంటనే కాపాడుకోగలిగింది. మిగిలిన ఇద్దరు పిల్లలు బతికి ఉంటారన్న ఆశతో గంటల తరబడి వారికోసం శిధిలాలను వెలికితీసింది. చివరికి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది.  చేతుల్లోంచి రక్తం వస్తున్నా సరే పట్టించుకోకుండా తన పిల్లల దేహాలను వెలికి తీసి వాటికి ఒంటరిగానే ఖననం నిర్వహించిందా కన్నపేగు.  నేపాల్ ను కదిలిస్తే చాలు ప్రస్తుతం ఇలాంటి విషాదకర ఘటనలు ఎన్నో... ఎన్నెన్నో...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ