ఏడుగురిని చంపి తానూ కాల్చుకున్న ఉన్మాది

February 28, 2015 | 01:58 PM | 77 Views
ప్రింట్ కామెంట్
psycho_killed_seven_people_in_america_niharonline

అమెరికాలో ఓ వ్యక్తి ఉన్మాదంతో రెచ్చిపోయి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు చనిపోగా, ఆ తర్వాత అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టైరోన్ పట్టణానికి చెందిన ఒక ఉన్మాది ఈ కాల్పులు జరిపాడు. ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల్లో 7 మందిని కాల్చి చంపి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులు జరిపిన అనుమానితుడి మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన వాహనంలో నిందితుడి మృతదేహాన్ని, నాలుగు ఇళ్లలో బాధితుల మృతదేహాలను కనుగొన్నట్టు పోలీసులు వెల్లడించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ