మోదీ లక్ష్మణుడు... జశోదా ఊర్మిళ

December 09, 2014 | 11:53 AM | 61 Views
ప్రింట్ కామెంట్

ఉన్నావ్ ఎంపీ సాక్షి మహారాజ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ ను లక్ష్మణుడి భార్య ఊర్మిళతో పోల్చారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఘనవిజయానికి కారణం జశోదాబెన్ అని సూత్రీకరించారు. ఆర్కేపురంలో నిర్వహించిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ... రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వనవాసం వెళ్లాడని, అయితే, ఆ సమయంలో లక్ష్మణుడి భార్య వనవాసం వెళ్లకుండా తపస్సులో మునిగిపోయిందని తెలిపారు. ఆమె తపస్సే లక్ష్మణుడికి శక్తినిచ్చిందని, తద్వారా యుద్ధంలో వీరోచితంగా పోరాడగలిగాడని సాక్షి మహారాజ్ వివరించారు. అలాగే, మోదీ విజయం వెనుక జశోదాబెన్ ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధి బాధ్యతలు మోదీ స్వీకరిస్తారని, దేశాన్ని ఎలా నడిపిస్తున్నారో, అలాగే ఢిల్లీని కూడా పురోగామి పథంలో తీసుకెళతారని ఆయన చెప్పారు. మదర్సాలు ఉగ్రవాదానికి, జిహాదీకి పుట్టిళ్లని గతంలో ఒకసారి మహారాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ