వన్డే ర్యాం‘కింగ్స్’ భారత్

November 17, 2014 | 11:03 AM | 46 Views
ప్రింట్ కామెంట్

ఐసీసీ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా భారత్ ఈ ఘనత సాధించింది. 113 పాయింట్ల నుంచి 117 పాయింట్లు సాధించి సౌతాఫ్రికా(115) జట్టును వెనక్కినెట్టి టాప్ కు చేరింది. ఇక భారత్ తో సిరీస్ లో ఘోర పరాభవం చవిచూసిన శ్రీలంక తన నాల్గవ స్థానాన్ని పదిలపరుచుకున్నప్పటికీ 108 పాయింట్లకు దిగజారింది. ప్రస్తుతం ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంక చేరుకున్న అలెస్టర్ కుక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు పట్టికలో ఐదవస్థానంలో నిలిచింది. ఇక అగ్రస్థానం కోసం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతుండటంతో భారత్ అగ్రస్థానం ఎంతో కాలం ఉండకపోవచ్చు. ప్రస్తుతం వన్డే సిరీస్ లో 1-1 తో సమానంగా ఉన్న ఈ ఇరుజట్లలో ఏ ఒక్కటి మిగతా మూడు వన్డేలు గెలిచినా సరే అగ్రస్థానానికి చేరుతాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ