జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం సఫలం

December 18, 2014 | 10:31 AM | 27 Views
ప్రింట్ కామెంట్

ఇస్రో చరిత్రలో మరో అద్భుతం చోటుచేసుకుంది. అత్యంత బరువున్న వ్యోమగాముల గదితో అంతరిక్షంలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతమైంది. కొద్దిసేపటి క్రితం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు కక్కుతూ జీఎస్ఎల్వీ మార్క్-3 నింగిలోకి దూసుకెళ్లింది. రూ.155 కోట్లతో ఖర్చుతో నిర్మించిన జీఎస్ఎల్వీ మార్క్-3 కేవలం 325 సెకన్లలోనే 3,735 కిలోల బరువున్న వ్యోమగాముల గదిని నిర్ణీత కక్ష్యలో (భూమికి 126 కిలో మీటర్ల ఎత్తులో) ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో చరిత్రలో మరో విజయం చేరింది. జీఎస్ఎల్వీ విజయం నేపథ్యంలో చైర్మన్ రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలను అభినందించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ