ఆయన పడుకోరు... పడుకోనివ్వరు

November 17, 2014 | 12:47 PM | 43 Views
ప్రింట్ కామెంట్

ఈ డైలాగ్ ఎక్కడో విన్నటుంది కదా? గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా ఎక్కువగా వినిపించేది. పనులన్నీ పూర్తయ్యే వరకు సీఎం చంద్రబాబు మమల్ని నిద్రపోనిచ్చేవారు కాదు అని అధికారులు ఇలా వాపోయేవారు. అయితే ఇప్పుడు ఆ పని చేసేది ఆయనా కాదు, వాపోయింది అధికారులు కాదు. ఓ వ్యక్తి కారణంగా కేంద్ర మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఆ వ్యక్తి ఎవరో కాదు, స్వయానా ప్రధాని నరేంద్ర మోదీయే అట. పైగా ఈ విషయాన్ని చెప్పింది వాళ్లూ వీళ్లూ కాదండోయి. స్వయానా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు. ప్రధాని మోదీకి తెల్లవారుజామునే నిద్ర లేచే అలవాటుంది. ఇక ఆయన మేలుకోవడమే ఆలస్యం పాలనపై దృష్టి సారిస్తారు. అందులో భాగంగా తమపై కూడా ఒత్తిడి తెస్తారు. దీంతో తమకు కూడా నిద్ర సరిగా ఉండటం లేదని ఆయన వాపోయారు. అయినప్పటికీ ప్రజా సేవ కోసం తాము ఇలాంటి వాటిని అస్వాదిస్తున్నామని, ప్రజల కోసం, సామాన్యుల జీవనాన్ని మెరుగు పరిచేందుకు పని చేయడం జీవితంలో అన్నింటికంటే చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. మొత్తానికి మోదీ కారణంగా మంత్రులకు కంటి మీద కునుకు కరువైందన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ