ఇమామ్ బుఖారీకి ఢిల్లీ కోర్టు షాక్

November 21, 2014 | 01:14 PM | 34 Views
ప్రింట్ కామెంట్

జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీకి ఢిల్లీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తన కుమారుడైన షాబాన్ బుఖారీని మసీదు డిప్యూటీ షాహీ ఇమామ్ గా పేర్కొంటూ జారీచేసిన ప్రకటనకు చట్టబద్ధత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు షాబాన్ బుఖారీ ప్రమాణస్వీకారోత్సవంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులు జనవరి 28లోగా నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కాగా ఇమామ్ పదవిని 400 సవత్సరాలుగా బుఖారీ కుటుంబమే నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బుఖారీ తనయుడు షాబాన్‌ బుఖారీని డిప్యూటీగా నియమించేందుకు ఈనెల 22న ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఇమామ్ బుఖారీ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమంది మత పెద్దలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తోపాటు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తదితరులను ఆహ్వానించారు. అయితే దేశంలోని ముస్లింలను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రధాని మోదీని ఈ కార్యక్రమానికి బుఖారీ ఆహ్వానించలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ