ఆప్ కీ అదాలత్ లో రాష్ట్రపతి, పీఎం

December 01, 2014 | 11:21 AM | 23 Views
ప్రింట్ కామెంట్

ఇండియా టీవీ చానెల్ లో ప్రసారమయ్యే ఆప్ కీ అదాలత్ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు సీనియర్ మంత్రులు హజరుకాబోతున్నారని సమాచారం. ఈ కార్య్రమాన్ని ప్రారంభించి 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 21న నిర్వహించే కార్యక్రమంలో వీరు పాలుపంచుకోనున్నారని ‘ఇండియా టీవీ’ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక రాష్ర్టం తరపు నుంచి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి అయిన లక్ష్మీ పార్వతికి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వనం అందింది. ఇందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి షారూఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ త్రయంతోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆహ్వనం పంపినట్లు ఇండియా టీవీ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్, కార్యక్రమ వ్యాఖ్యత రాజత్ శర్మ తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ