తప్పుడు కేసులతో కాపురాలు కూల్చుకోకండి

December 09, 2014 | 12:51 PM | 65 Views
ప్రింట్ కామెంట్

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498-ఏ పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ పై మహిళలు పెడుతున్న తప్పుడు కేసుల సంఖ్య పెరిగిపోతున్నదని, ఆ తరువాత మహిళలు పశ్చాత్తాప పడ్డా తమ కాపురాలు నిలుపుకోలేక పోతున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, ఏ.కే. సిక్రీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. "ఎటువంటి తప్పు చేయకుండానే ఆడపడుచులు, భర్త తల్లిదండ్రులను సెక్షన్ 498-ఏ ఉపయోగిస్తూ జైళ్లకు పంపడం వివాహ వ్యవస్థను దెబ్బతీస్తోంది" అని ఓ కేసును విచారించిన సందర్భంగా న్యాయమూర్తులు అన్నారు. ఒకసారి తప్పుడు కేసు పెట్టిన తరువాత కాపురం నిలవడం లేదని వారు అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ