సీఆర్పీఎఫ్ ఛీఫ్ సంచలన వ్యాఖ్యలు

November 28, 2014 | 11:04 AM | 36 Views
ప్రింట్ కామెంట్

సీఆర్పీఎఫ్ డైరక్టర్ జనరల్ దిలీప్ త్రివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాలు మావోయిజం కొనసాగాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. ఆయా రాష్ట్రాలు నక్సల్ హింస కొనసాగేందుకు అవకాశం కల్పిస్తున్నాయని, తద్వారా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఆ రాష్ట్రాలు భావిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పేలుడు పదార్థాల అమ్మకాల నియంత్రణను కేంద్రం సీరియస్ గా తీసుకోవడంలేదని, దీంతో అవి మావోయిస్టులకు సులభంగా అందుతున్నాయని వెల్లడించారు. ఈ కారణంగా భద్రతా బలగాల సిబ్బంది అత్యధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని త్రివేది వివరించారు. రేపో, ఎల్లుండో పదవీ విరమణ చేయనున్న దిలీప్ త్రివేది పోయే ముందు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ