నోరు జారీ ఆపై సారీ

December 02, 2014 | 10:56 AM | 27 Views
ప్రింట్ కామెంట్

అధికార, ప్రతిపక్ష తారతామ్య భేదాల్లేకుండా ఈ మధ్య మన నేతలు నోటికి ఏదోస్తే అది మాట్లాడేయం ఆపై చిన్నగా సారీ చెప్పడం పరిపాటి అయిపోయింది. తాజాగా ప్రధాని మోదీ కేబినెట్ లో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సాధ్వీ నిరంజన్ జ్యోతి ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. "రాముడి అనుచరుల ప్రభుత్వాన్ని కోరుకుంటారా? లేక అక్రమ సంతానం అనుచరుల ప్రభుత్వాన్ని కోరుకుంటారా?" అంటూ రాబర్ట్ వాద్రాను ఉద్దేశించి జ్యోతి వ్యాఖ్యానించారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇక అలా వ్యాఖ్యానించారేమిటన్న విలేకరుల ప్రశ్నలకు స్పందించిన జ్యోతి, "అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాద్రాకు అంత ఆస్తులెక్కడివి? వారు దేశాన్ని, దేశ ప్రజలను లూటీ చేశారు" అంటూ ఆమె తన వ్యాఖ్యలను సమర్థించుకునే యత్నం చేశారు. తాను వేర్పాటువాదులు, జాతి వ్యతిరేక శక్తులను లక్ష్యంగా చేసుకునే ఈ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. తన మాటలను ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ