హయ్యా... రెండోది కూడా పోయినట్టె!

December 20, 2014 | 10:11 AM | 32 Views
ప్రింట్ కామెంట్

ఆడినట్టే ఆడుతుంది కానీ ఎక్కడో తేడా కొట్టి విచిత్రంగా ఓడిపోతుంది మన భారత్ జట్టు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో, భారత్ ఆధిక్యం 127 పరుగులు కాగా, ఆస్ట్రేలియా కేవలం 128 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా మరో ఓటమి ముంగిట ఉన్నట్టే. మన బౌలర్లు అద్భుతం చేస్తే తప్ప ఓటమి ఖాయమైనట్టే! భారత్ రెండవ ఇన్నింగ్స్ లో ధావన్ 81 పరుగులు చేయగా, ఐదుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోర్ ను చేరుకోలేకపోవడం గమనార్హం. రోహిత్ శర్మ, ధోనీ డకౌట్ అయ్యారు. ప్రస్తుతం 22/1 తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ