పండిత పుత్రః పరమ శుంఠ

December 10, 2014 | 10:24 AM | 29 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన నిందితుడు శివకుమార్ యాదవ్ గురించి పోలీసుల విచారణలో ఆశ్చర్యం కలిగించే విషయంలో వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి జిల్లా రాంనగర్ గ్రామంలో ఓ హెడ్మాస్టారి కొడుకే ఈ శివకుమార్. పండిత పుత్రః పరమ శుంఠ అన్నట్లుగా అతగాడు సీరియల్ రేపిస్టుగా తయారయ్యాడు. గతంలో అతడి మీద చాలా అత్యాచారయత్నం కేసులున్నాయి. గూండా చట్టం, ఆయుధాల చట్టం కింద కూడా పలుమార్లు బుక్కయిన ట్రాక్ రికార్డ్ మనోడికి ఉంది. రాంనగర్ గ్రామంలో శివకుమార్ వస్తున్నాడంటే చాలు… అమ్మాయిలను ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సిందిగా వారి తల్లిదండ్రులు చెబుతారట. తాగి గొడవలు చేయడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అమ్మాయిల దుపట్టాలు లాగడం, ఇంకా అవకాశం ఉంటే మరింత దారుణాలకు తెగబడటం శివకు అలవాటని గ్రామస్తులు చెబుతున్నారు. ఇతడి ఆగడాలను భరించలేక కొన్నేళ్ల క్రితమే పోలీసులు అతడిని జిల్లా నుంచి బహిష్కరించారు. శివకుమార్ యాదవ్ తండ్రి రామ్ నాథ్ యాదవ్ (76) స్థానిక మున్సిపల్ హైస్కూల్లో హెడ్మాస్టారిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన చాలా మంచివారని, ఇప్పుడు తన కొడుకు చేస్తున్న దురాగతాలకు చాలా బాధపడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఆయన ఎప్పుడో తన కొడుకును ఇంటినుంచి తరిమేశారు. తన కొడుకు చేస్తున్న పనులకు సిగ్గుతో తలెత్తుకోలేకపోతున్నానని, దీనికంటే చనిపోతే బాగుండునని అతడి తల్లి గంగశ్రీ వాపోయారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ