కాళ్ల మీద పడితే కన్యాదానం చేసేశాడు

December 13, 2014 | 12:44 PM | 40 Views
ప్రింట్ కామెంట్

వివాహం చేసుకున్న భార్యను కన్యాదానంగా ప్రియునికి ఇచ్చి వివాహం జరిపించాడు తమిళనాడులో ఓ భర్త. తిరుచురాపల్లి జిల్లా, తురైయూరు సమీపం ఉప్పిలియాపురం వద్ద ఓ గ్రామానికి చెందిన దేవి, తురైయూర్ యూనియన్‌లోని మరో గ్రామానికి చెందిన నందకుమార్ (26)కు పెళ్లి చేయూలని పెద్దలు నిశ్చయించారు. 20 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. బుధవారం ఉదయం వరుడి ఇంట్లో వీరిద్దరి వివాహం అట్టహాసంగా సాగింది. వరుని ఇంటికి వచ్చిన తర్వాత మొదటి రాత్రి దేవి... నందకుమార్ కాళ్లపైపడి భోరున విలపించింది. నందకుమార్ ఏమి జరిగిందని ఆమెను ప్రశ్నించాడు. నవ వధువు మాట్లాడుతూ తన ఊరికి చెందిన లారీ డ్రైవర్‌ను ప్రేమిస్తున్నానని, తల్లిదండ్రులు బలవంతంగా ఈ వివాహం జరిపించారని తెలిపింది. తనను అతనితో కలపాలని ప్రాథేయపడింది. నందకుమార్ తన భార్యను ప్రియుని చెంతకు చేర్చేందుకు నిర్ణయించాడు. ఆపై వేరే ప్రాంతానికి వెళ్లిన ప్రియున్ని రప్పించి దేవితో తురైయూరు పెరుమాల్ ఆలయంలో వివాహం జరిపించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ