నమో పాలన అబ్ తక్ ఠీక్ హై

November 26, 2014 | 11:22 AM | 31 Views
ప్రింట్ కామెంట్

ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు పరిపాలన పనితీరు బాగానే ఉందని మెజారిటీ ప్రజలు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆరు నెలల మోదీ పాలనపై న్యూస్ నేషన్ అనే ఓ హిందీ న్యూస్ ఛానెల్ దేశవ్యాప్తంగా ఓపీనియన్ పోల్ ను నిర్వహించింది. దీనిలో 72 శాతం మంది ప్రజలు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పాలన తీరు బాగానే ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విజయవంతమయిందని 55 శాతం మంది తెలుపారు. మోదీ ప్రభుత్వం పనితీరు ‘పని తక్కువ-ప్రచారం ఎక్కువ’ అన్న చందాన ఉందని 45 శాతం ప్రజలు తెలుపగా, అందులో వాస్తవం లేదని 43 శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మరోవైపు మోదీ ప్రధాని అయ్యాకే దేశ ప్రతిష్ట పెరిగిందని 77 శాతం మంది ప్రజలు తెలిపారు. ఓవరాల్ గా మోదీ ప్రభుత్వ పనితీరుపై 18 శాతం మంది ప్రజలు మాత్రమే పూర్తి అసంతృప్తి తో ఉన్నారని పోల్ లో వెల్లడయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ