కుష్బూ మళ్లీ వివాద వార్తల్లోకి...

December 19, 2014 | 05:18 PM | 27 Views
ప్రింట్ కామెంట్

సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కే కుష్బూ మళ్లీ ఓ వివాదాస్పద అంశంతో వార్తల్లో చేరిపోయింది. ఈ మధ్య కాలంలోనే పెళ్లికి ముందు సెక్స్ తో తప్పేంటి? అంటూ మాట్లాడి అభిమానుల ఆగ్రహానికి గురైంది. అభిమానులు కట్టిన గుడిని కూల్చే స్థాయికి తెచ్చుకుంది. అలాగే మరో వ్యాఖ్యతో అన్నాడీఎంకే పార్టీ వారికి కోపం తెప్పించి డీఎంకేలో చేరింది. ఆ తరువాత ఆ పార్టీలో వారసత్వ రాజకీయాలపై ఘాటుగా మాట్లాడి మళ్లీ ఆ పార్టీకి కూడా దూర మైంది. ఇలా వార్తల్లో కనిపిస్తూనే ఈ మధ్య మరో వివాదం కొని తెచ్చుకుంది. అదేమిటంటే ఎల్టీటీఈ వాళ్లను తీవ్రవవాదులని అనేసింది. తమిళనాడులో ఎల్టీటీఈ సానుభూతిపరులు, మద్దతుదారులు చాలా మందే ఉన్నారు. దీంతో ఆమె మాటలను వెనక్కు తీసుకోవాలని తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడీమె కాంగ్రెస్ క్రియాశీలకం అయ్యింది. అనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ