ఎవరి మాటా వినడు

December 10, 2014 | 03:05 PM | 28 Views
ప్రింట్ కామెంట్

ప్రమాదం పొంచి ఉందన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి మాటా వినడట. ఉగ్రవాదుల దాడులు జరగవచ్చని, ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదమున్న కారణంగా, శ్రీనగర్ పర్యటనను విరమించుకోవాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), నిఘావర్గాలు హెచ్చరించినా, మోదీ వినలేదట. డిసెంబర్ 8న ఎన్నికల ప్రచారం కోసం మోదీ శ్రీనగర్ వెళ్ళే ముందు వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్పీజీ మోదీని హెచ్చరించింది. మోదీ ససేమిరా అనడంతో మొత్తం 40 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని ఓ అధికారి తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ