బ్లాక్ మనీయే పెద్ద సవాల్

November 15, 2014 | 10:24 AM | 39 Views
ప్రింట్ కామెంట్

దేశ భద్రతకు నల్లధనమే పెద్ద సవాల్ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రముఖులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న ఐదు దేశాధినేతల బ్రిక్స్ సదస్సులో భాగంగా మోదీ ప్రసంగిస్తు నల్లధనం వల్ల దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని స్వదేశం తీసుకురావడానికి ఆయా దేశాల సమన్వయ సహకారం అవసరమని మోదీ కోరారు. ఇక శనివారం బ్రిస్బేన్ లో నిర్వహించనున్న జీ-20 సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని టోని అబ్బోట్ తో భేటీ అవుతారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ