ఉరికాదులే... చెప్పుతో కొడితే చాలు

December 08, 2014 | 10:42 AM | 32 Views
ప్రింట్ కామెంట్

విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వ్యక్తులపై యూపీ గవర్నర్ రాం నాయక్ మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేశారు. విద్యుత్ దొంగలను వీధుల్లో బహిరంగంగా చెప్పులతో కొట్టాలని అన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడేవారిని బహిరంగంగా ఉరితీయాలని ఇంతకు ముందు ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మానవతా కారణాల ద్రుష్ట్యా ఉరితీయాలన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొన్నప్పటికీ... ప్రపంచంలో మరెక్కడా లేనంతగా మన దేశంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు, మానవ వనరులు, విద్యుత్తు మధ్య సమతుల్యత ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ