విపక్షాలపై వెంకయ్య ఫైర్

December 08, 2014 | 12:26 PM | 64 Views
ప్రింట్ కామెంట్

సభ సజావుగా సాగాలని ఎంత విన్నవిచింనప్పటికీ విపక్షాలు శాంతించకపోవటంతో పార్లమెంట్ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు ఆగ్రహానికి లోనయ్యారు. సోమవారం యథావిథిగా కూడా విపక్ష సభ్యులు సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యల అంశాన్ని సభలో లేవనెత్తారు. దీంతో, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో సాధ్వి జ్యోతి క్షమాపణలు చెప్పారని... ఈ అంశానికి సంబంధించి ప్రధాని మోదీ కూడా వివరణ ఇచ్చారని... దీంతో, ఈ అంశం ముగిసిందని చెప్పారు. అనవసరంగా ఇదే అంశాన్ని పదేపదే లేవనెత్తుతూ, సభను అడ్డుకోవడం మంచిది కాదని మండిపడ్డారు. సభ సజావుగా కొనసాగేందుకు సహకరించాలని కోరారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ