కెప్టెన్ కోహ్లీ సెంచరీ

December 11, 2014 | 12:38 PM | 31 Views
ప్రింట్ కామెంట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ధోనీ స్థానంలో జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టిన యువ కెరటం విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి... భారీ స్కోరుతో టీమిండియాను ముందుండి నడిపించాడు. మొత్తం 158 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్ల సహాయంతో శతకాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో తన టెస్టు కెరియర్లో 6వ సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ కోహ్లీకి అండగా ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 361 పరుగులు. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ర్టేలియా 517/7 డిక్లేర్డ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ