గుండెపోటుతో క్రికెటర్ మృతి

December 10, 2014 | 12:18 PM | 28 Views
ప్రింట్ కామెంట్

ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిఫ్స్ హ్యూస్ మరణం నుంచి పూర్తిగా తేరుకోకముందే అలాంటి మరో దుర్ఘటనే అభిమానుల్లో విషాదం నింపింది . రత్నాకర్ మోరే అనే 29 ఏళ్ల క్రికెటర్ ముంబై ఓవల్ మైదానంలో ఆడుతూ గుండెపోటుతో మృతిచెందారు. టాటా పవర్ సంస్థ నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా ఆడుతున్న మైదానంలో గుండెపోటుతో కుప్పకూలారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు స్పష్టం చేశారు. ఆయన భార్య ప్రస్తుతం 7 నెలల గర్భవతి. ఆమె ఆజాద్ మైదాన్ పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్ పరిధిలోనే క్రీడా మైదానం ఉండటం, అక్కడే కేసు నమోదు కావడంతో స్టేషన్ లో సైతం విషాదఛాయలు అలముకున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ