సానియా గెలుపుపై మోదీ ఏమన్నాడంటే?

September 14, 2015 | 11:12 AM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-wishes-to-sania-on-US-open-winning-niharonline

యూఎస్ ఓపెన్ లో సానియా మీర్జా మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. దీనిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు.

‘సానియా... యూఎస్ ఓపెన్ లో నీ విజయం అద్భుతం. కంగ్రాట్స్. నీ గెలుపు పట్ల యావత్ దేశం గర్విస్తోంది’ అని మోదీ ట్వీట్ చేశారు.

టోర్నీలో మార్టినా హింగిస్ తో జోడిగా బరిలో దిగిన సానియా ఫైనల్లో డెలాక్వా-ష్వెదోవా జోడిని 6-3, 6-3 తో మట్టికరిపించి టైటిల్ నెగ్గింది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ లకు 5 లక్షల 70 వేల డాలర్ల ప్రైజ్ మనీ (రూ.3 కోట్ల 77 లక్షలు) లభించింది. కాగా, సానియా ఈ విజయంతో ఈ ఏడాది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ