నితీశ్ కంచు కోటలో మోదీ మూడు ర్యాలీలు

July 30, 2015 | 03:22 PM | 3 Views
ప్రింట్ కామెంట్
PM_narendra_modi_parivarthan_rally_in_bihar_niharonline

బీహార్ ఎన్నికలు సమీపిస్తుండంతో అక్కడి రాజకీయాల్లో వాడి వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అండ్ అలయన్స్ ఎలాగైనా సరే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి మోదీ ప్రాభవ్యం లేదని నిరూపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇదే సమయంలో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పి కొట్టేందుకు మోదీ కూడా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 25 న ముజఫర్ పూర్ లో ర్యాలీ నిర్వహించి తన సత్తా చాటిన మోదీ ఆ రాష్ట్రంలో మరో మూడు ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆగష్టు 9న గయలో, 19న సహస్రాలో, 30 న భాగల్ పూర్ లో పరివర్తన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పనులను బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ ఇప్పటికే ప్రారంభించారు. ముజఫర్ ర్యాలీలో నితీశ్ ప్రభుత్వం పై ఓ  రేంజ్ లో విరుచుకుపడిన మోదీ మిగతా సభల్లో కూడా ఓ రేంజ్ లో విజృంభిస్తారో అన్నది వేచి చూడాలి. మరి నితీశ్, లాలూ అండ్ కో ఆ విమర్శలను ఎలా తిప్పి కొడతారో?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ