కలాం మృతికి ప్రధాని మోదీ సంతాపం

July 28, 2015 | 11:17 AM | 4 Views
ప్రింట్ కామెంట్
modi_tribute_to_APJ_abdul_kalam_death_niharonline

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. అబ్దుల్ కలాం గొప్ప శాస్ర్తవేత్తే కాదు, రాష్ట్రపతిగా కూడా దేశానికి అద్బుతంగా సేవలు అందించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన హఠాన్మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తుంది అని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. కలాం జ్నాపకాలన్నీ నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఆయనను ఎన్నో సార్లు కలిశాను. కలాం మేధాశక్తికి ఎప్పటికప్పుడు నన్ను ఆశ్చర్యపరిచేది. ఎంతో ఆయన్నుంచి నేర్చుకున్నాను. ప్రజలతో ఉండటాన్ని, వారికి సేవలందించడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ముఖ్యంగా ఆయనకు విద్యార్థులంటే చాలా ఇష్టం. చివరి క్షణాలను కూడా ఆయన వారితోనే గడపటం విశేషం అని మోదీ పేర్కొన్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ