తీపి సంక్షోభం పై మోదీ మంత్రివర్గ సమావేశం

August 01, 2015 | 02:06 PM | 3 Views
ప్రింట్ కామెంట్
modi_on_sugar_crisis_niharonline

దేశంలో ప్రస్తుతం చక్కెర రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ కానున్నారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి  రామ్ విలాస్ పాశ్వాన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పంచదార రంగంలో సంక్షోభాన్ని నివారించేందకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సాధ్యాసాధ్యాలపై చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే బాధ్యత మోదీకి అప్పగించనున్నట్లు రాం విలాస్ మీడియాతో తెలిపారు. సమావేశనంతరం ధరల పెంపు తగ్గింపుతోపాటు విదేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులపై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ