రాజీవ్ జయంతి సందర్భంగా మోదీ నివాళులు

August 20, 2015 | 11:40 AM | 4 Views
ప్రింట్ కామెంట్
modi_pays_tribute_to_rajiv_gandhi_on_birth_anniversary_niharonline

దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. గురువారం (ఆగష్టు 20న) రాజీవ్ గాంధీ 71 వ జయంతి సందర్భంగా ట్విట్టర్లో మోదీ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు.

                            రాజీవ్ 1944 ఆగష్టు 20న ఫిరోజ్ గాంధీ-ఇందిరాగాంధీ  దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. 1984 అక్టోబర్ 31 నుంచి 1989 డిసెంబర్ 2 వరకు ఆయన ప్రధానిగా వ్యవహారించారు. తమిళనాడు లోని శ్రీపెరంబుదూర్ లో 1991 మే 21 న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను ఎల్టీటీఈ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో హతమార్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ