వీళ్లింక నీళ్లోసుకోరా అధ్యక్షా?

March 11, 2015 | 05:15 PM | 46 Views
ప్రింట్ కామెంట్
Jagan_assembly_niharonline

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల ఈటెలు విసురుకున్నారు. తెలుగు దేశం మంత్రి అచ్చెన్నాయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మధ్య వాడీవేడిగా వాగ్యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షనేత మాట్లడకపోవటం ఇదేం తొలిసారి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించటంతో రభస మొదలైంది. ఆయన వ్యాఖ్యలను వైకాపా నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... మాకు అసలు మైక్ ఇస్తేనే కదా. దాన్ని బట్టి బడ్జెట్ పై తాను ఎంత మాట్లాడి ఉంటానో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో మిమల్ని కడిగి పారేస్తా... కడిగించుకోండి అని జగన్ వ్యాఖ్యానించారు. వెంటనే టీడీపీ నేత అచ్చెన్నాయుడు కల్పించుకోని ‘‘మమల్ని కడగటం తర్వాత... ముందు మీకంటిన అవినీతి మురికి కడుక్కోండి... ఎంత కడిగినా అది పోదు’’ అని కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షా... జలయజ్ఝంలోని లక్షల క్యూసెక్కుల నీళ్లతో ప్రక్షాళన చేసినా వీళ్ల మురికి పోయేదేనా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ